44వ రోజు బిగ్ బాస్ ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది ఈ టాస్క్ కోసం బిగ్బాస్ ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. ఒక గ్రూపు రాక్షసుల గ్రూపు కాగా మరొక గ్రూపు మానవులది. ఇక వీరిద్దరి మధ్య హోరాహోరీగా టాస్క్ జరిగింది. ఎలాగైనా టాస్క్ గెలుచుకోవడానికి సభ్యులు చేసిన ప్రయత్నాలు చాలా వినోదకరంగా ఉన్నాయి.
అవినాష్, హారిక, అరియానా, మెహబూబ్, అఖిల్ లను రాక్షసుల గ్రూపు గా…. అభిజిత్, రాజశేఖర్, నోయల్, లాస్య లను మానవ గ్రూప్ లు గా చేశారు. రాక్షసి గ్రూపులో వారు మానవ గ్రూపు లో వాళ్ళను చిలిపి చేష్టలతో విసిగించే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే వీరిని కోపగించుకుంటారో వారిని రాక్షస గ్రూపులో కలిపేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మనుషులు మంచి పనులతో రాక్షసులను మానవులుగా మార్చుకోవచ్చు. ఇలా ఈ టాస్క్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ సమయంలో అమ్మరాజశేఖర్ ను అరియానా గ్లోరీ విపరీతంగా విసిగిస్తుంది. అతనికి కోపం తెప్పించే ప్రయత్నం చేయగా…. శాంతి…. శాంతి అంటూ రాజశేఖర్ జపం చేశారు. అప్పుడు అరియానా శాంతి అంటే నీ రెండవ సెటపా ఆట పట్టించింది.
అయితే అరియానా ఇలా అడగడం నెటిజన్లకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినా…. టాస్క్ కోసం ఈ రకంగా కోపం తెప్పించడాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే నోయల్ సీన్ తలపై అరియానా గుడ్డు కొట్టింది. రాక్షసుడిగా అవినాష్ కూడా డైలాగ్స్ తో బాగా అలరించాడు. ఇక రెండు టాస్కుల్లో మానవుల టీమ్ దే పై చేయి పైచేయి కావడం విశేషం