ఉత్తరాదిలో బలంగా ఉన్న బిజెపి దక్షిణాదిలో పుంజుకోవడానికి మెల్ల మెల్లగా పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో ఏపీలో కూడా రాణించడానికి బీజేపీ పెద్దలు దారులు వెతుక్కుంటున్నారు అనే టాక్ జాతీయ మీడియాలో గట్టిగా వినబడుతోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో ఏపీ రాజకీయాలను కుదిపేసింది అమరావతి ప్రాంతంలో పర్యటించడానికి షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యటనలో చేపట్టడం తో జేపీ నడ్డా పై వస్తున్నా వార్తలకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ బీజేపీ నేతలు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని తాజాగా ప్లేటు ఫిరాయించి మాట్లాడటం ఏపీ రాజకీయవర్గాలలో ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చి త్వరలోనే ప్రధాని మోడీ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, మాట్లాడిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా త్వరలో సోము వీర్రాజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలసి మరొకసారి అమరావతి రైతులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో టాక్. ఇదిలావుంటే ఇటీవల బీజేపీ కేంద్ర కార్యాలయం అమరావతి ప్రాంతంలోనే నిర్మిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో బిజెపి బలంగా నాటుకోవడానికి ఇదే కరెక్ట్ సమయమని అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు దూసుకుపోతే బెటర్ అనే రీతిలో బీజేపీ పెద్ద భారీ వ్యూహాలను వేస్తున్నారట. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏపీ పై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.