Ys Jagan Mohan Reddy : అమరావతి రైతులు దాదాపు 400 రోజులకు పైగా ఆందోళనలు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని దాదాపు 29 గ్రామాల రైతులు గత కొంత కాలం నుండి ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సీఎం జగన్ అమరావతి రైతులు చేస్తున్న దీక్ష గురించి గానీ నిరసనలు గురించి గానీ ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. మరోపక్క తన అనుకున్న 3 రాజధానుల నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యే రీతిలో ఢిల్లీ నుండి గల్లీ దాకా ఏ అవకాశాన్ని వదలడం లేదు. మరోపక్క అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు ప్రధానంగా టీడీపీతో పాటు చాలా పార్టీలు మద్దతు తెలపడం అందరికీ తెలిసిందే. ఇదిలాఉంటే ఇటీవల వైయస్ జగన్ కాన్వాయ్ కి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. మేటర్ లోకి వెళ్తే జగన్ సచివాలయానికి వెళ్తున్న సమయంలో జయ అమరావతి అంటూ అమరావతి రైతులు జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఈ ఘటన మందడం లో జరిగింది. రైతులతో పాటు మహిళలు ఈ ఈ క్రమంలో ప్లకార్డులు పట్టుకుని ..సరిగ్గా జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో గట్టి గట్టిగా కేకలు వేయడంతో అనుమానంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే రైతులకు అడ్డంగా నిలబడి కాన్వాయ్ ఆగిపోకుండా నిలువరించారు. ఏంటో కాన్వాయ్ లో ఉన్న జగన్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ విషయంలో స్పందించకపోవడం పట్ల రైతులు మాత్రమే కాక ఇతర పార్టీల నాయకులు కూడా మండిపడుతున్నారు. మరో పక్క వైసీపీ మాత్రం అభివృద్ధి అనేది ఒక చోట కాకుండా అన్ని చోట్ల జరగాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పుకొస్తూ ఉంది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు దీక్షలు చివరాకరికి ఎటు దారి తీస్తుందో అన్నది సస్పెన్స్ గా నెలకొంది.