క్రియోటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా కేజీయఫ్ ఛాప్టర్ 1. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా రికార్డ్ ని క్రియోట్ చేసింది. ఛాప్టర్ 1 తో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటుగా యష్ ఓవర్ నైట్ స్టార్ డం ని సంపాదించుకున్నారు.
కేజీయఫ్ ఛాప్టర్ 1 ఊహించని సక్సస్ అందుకోవడంతో ప్రస్తుతం ఈ సీక్వెల్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కేజీయఫ్ చాప్టర్ 2 కోసమే యష్ తన మేకోవర్ తో ప్రీక్వెల్ కంటే సాలిడ్ గా ప్రిపేర్ అయ్యాడు. కాగా ఈ సినిమాలో ఉన్న ఒక పవర్ ఫుల్ రోల్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ పోషిస్తున్న అధీరా ఫస్ట్ లుక్ సినిమా మీద భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కోసం షెడ్యూల్ ని హైదరాబాద్, బెంగళూరు, మంగళూర్ లలో ప్లాన్ చేశారు మేకర్స్. కాగా సంక్రాంతి బరిలో దిగబోతుందని సమాచారం.
అయితే ఈ సినిమా చాప్టర్ 1 కి పెద్ద పోటీ లేకపోవడం తో సంచలన విజయాన్ని అందుకుంది. కాని ఈ సారి చాప్టర్ 2 కి ఒక భారీ సినిమా పోటీగా దిగబోతుంది. అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకి రీమేక్ గా వకీల్ సాబ్ తెలుగులో రీమేక్ అవుతుండగా వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ ని సంక్రాంతి పండుగ కి ప్రేక్షకుల ముందు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారట. దాదాపు మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ సినిమా రాబోతుండటం తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు కేజీఎఫ్ 2 కి పోటీగా దిగబోతుండటం గొప్ప విషయం. మరి ఈ రెండు సినిమాలలో రికార్డ్స్ క్రియోట్ చేసేది ఏ సినిమానో చూడాలి. ఇక దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న కల నెరవేరబోతుంది.