ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ” రౌద్రం రణం రుథిరం “. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లు పోరాట యోధులుగా నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇన్ని రోజులు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ త్రివిక్రం సినిమాకి సంబంధిన అప్డేట్ రావడం లేదని తెగ ఫీలయ్యారు. ఈ న్యూస్ తెలియగానే వాళ్ళ ఆనందానికి అవధులేకుండా పోయాయట. ఇక త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో వెల్లడించనున్నారని తెలుస్తుంది.
అలాగే మరో సినిమాని మైత్రీ మూవి మేకర్స్ లో చేయబోతున్నాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమా ఎన్.టి.ఆర్ 31 వ సినిమాగా రూపొందనుండగా కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే తయారవనుంది. 2022 లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే.జీ.ఎఫ్ 2 కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.