తెలుగు బుల్లితెర మీద తమ హోస్టింగ్ స్కిల్స్ తో తమ సత్తా చాటుకున్నారు యాంకర్స్ అనసూయ రష్మీ మరియు శ్రీముఖి. బుల్లితెర మీద సక్సెస్ అవ్వడంతో పాటుగా వెండితెర మీద కూడా తమ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు రష్మీ మరియు అనసూయ. ప్రస్తుతం అనసూయ మరియు శ్రీముఖి ఇద్దరికి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
బుల్లితెర మీద హాట్ యాంకర్ గా పేరు పొందిన జబర్దస్త్ హోస్ట్ రష్మీ గౌతమ్ అటు హీరోయిన్ గా కూడా చాలా చిత్రాలు చేశారు. అలాగే జబర్ధస్త్ షో ద్వారా పేరు పొందిన అనసూయ కూడా వెండితెరపై ఇప్పటికే సక్సెస్ ను చవిచూశారు. కొన్ని సినిమాలో కీలకమైన పాత్రలు దక్కించుకుంది యాంకర్ అనసూయ.
రానున్న రోజుల్లో శ్రీముఖి కూడా వెండితెరపై బిజీ అయ్యేలా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీముఖి చిన్న చిన్న పాత్రలలో వెండితెర పై కనిపించినప్పటికీ ప్రాధాన్యం ఉన్న రోల్స్ మాత్రం ఆమెకు అంతగా దక్కలేదు.
అయితే శ్రీముఖి మొదటిసారి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ మూవీలో నటిస్తుంది. సింగర్ మను, భరణి మరియు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరకెక్కనున్నది. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ మూవీలో శ్రీముఖి, భార్యల ప్రేమకు దూరమైన అంకుల్స్ ని వలలో వేసుకొనే సెలెబ్రిటీగా కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో అనసూయ ఒక బోల్డ్ రోల్ ను చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రంలో అనసూయ ఒక దేవదాసి పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో ఆమె పాత్రలో ముఖ్యంగా హాట్ నెస్ పాళ్ళు ఎక్కువగానే ఉంటాయని సమాచారం.