బుల్లితెరపై తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న యాంకర్ అనసూయ మరోపక్క ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో అదరగొట్టే నటనతో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటుల చేత శభాష్ అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా రాణించి తర్వాత హీరోగా ప్రయత్నాలు చేసి మళ్లీ ఇప్పుడు కమెడియన్ అదేవిధంగా హీరో రెండు ట్రాకులు నడిపిస్తున్నాడు సునీల్.
డిస్కో రాజా అదేవిధంగా కలర్ ఫోటో సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రలు చేసి తనలో ఉన్న విలన్ యాంగిల్ కూడా బయట పెట్టాడు. ఇదిలా ఉంటే సునీల్ హీరోగా వేదాంతం రాఘవయ్య అనే డిఫరెంట్ టైటిల్ కలిగిన సినిమా ఆదివారం హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. హరీష్ శంకర్ ఈ సినిమాకి కథ అందిస్తుండగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సమర్పిస్తోంది.
ఇక ఈ సినిమాలో యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ హీరోయిన్ గా నటించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్ వస్తోంది. డైరెక్టర్ సీ చంద్రమోహన్ ఇటీవల అనసూయ కి స్క్రిప్టు వినిపించినట్లు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం.