బులితెర మీద స్టార్ యాంకర్ అనసూయ కు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకవైపు యాంకర్ గా మరో వైపు అద్భుతమైన పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విపరీతమైన పాపులారిటీని సాధించింది. అంతేకాదు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గానే ఒక స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదు. కాని అనసూయ అది సాధించి చూపించింది.
ప్రస్తుతం అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద విభిన్నమైన పాత్రలు పోషిస్తోంది. అనసూయ లో ఉన్న టాలెంట్ కి, క్రేజ్ కి ప్రముఖ దర్శక, నిర్మాతలు పిలిచి మరీ అనసూయకు అవకాశాలు ఇవ్వడం గొప్ప విషయం. ‘క్షణం’ ‘కథనం’ ‘ఎఫ్ 2’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘మీకుమాత్రమే చెప్తా’ ‘సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా ప్రేక్షకులను అలరించిన తీరు కి ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. ఈ సినిమా అనసూయ కి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
ఒకవైపు చిన్న స్క్రీన్ మీద మరో వైపు సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ బిజీగా బిజీగా ఉంటూ బాగా సంపాదిస్తుంది. అంతేకాదు ఈ పాపులారిటీతో అనసూయ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. స్మాల్ స్క్రీన్.. సిల్వర్ స్క్రీన్ ల తో పాటు సోషల్ మీడియాలోను తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకి కనువిందు చేస్తుంది. యూత్ నే తార్గెట్ అన్నట్టుగా హీరోయిన్ రేంజ్ లో హాట్ ఫోటో షూట్స్ తో జనాలకే కాదు సోషల్ మీడియాని వేడెక్కిస్తుంది.
ఒక పక్క సంప్రదాయ దుస్తుల్లో పద్దతిగా కనిపిస్తూనే మరో వైపు గ్లామర్ షో చేస్తూ కుర్రాల్లకి నిద్ర లేకుండా చేస్తుంది. దాంతో అనసూయ ట్రెండ్ ఫాలో అవడం కాదు ట్రెండ్ సెట్ చేస్తుంది అంటూ పవర్ స్టార్ డైలాగ్ ఆపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అందాలతో అట్రాక్ట్ చేస్తున్న ఓ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హాట్ గా ఉన్న బ్లాక్ టీ తాగుతూ హాట్ డ్రెస్ లో స్పైసీ లుక్ ఇచ్చి అనసూయ తీసుకున్న సెల్ఫీ జనాలకి హీట్ పెంచుతోంది. ఈ ఫొటోలో అనసూయని చూస్తే ఏ ఒక్కరు అనసూయకి ఇద్దరు పిల్లలంటే నమ్మడం కష్టమే.