మొత్తానికి కొత్త సంవత్సరం వచ్చేసింది. 2020కి సంతోషంగా అందరం బైబై చెప్పేశాం. 2021 కి వెల్ కమ్ చెప్పాం. న్యూఇయర్ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించడం కోసం ఈటీవీలో డీజే 2021 న్యూఇయర్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. మొత్తానికి కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ రచ్చరచ్చ చేశారు.
యాజ్ యూజ్ వల్ గా ఈటీవీలో ఈవెంట్స్ అంటేనే ఎక్కువగా అలరించేది జబర్దస్త్ బ్యాచ్. ఈ షోలో కూడా వాళ్లే ప్లస్. యాంకర్లుగా అనసూయ, ప్రదీప్ ఈ ఈవెంట్ ను ముందుకు తీసుకెళ్లగా… జడ్జీలుగా బాబా భాస్కర్, రోజా వ్యవహరించారు.
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చలాకి చంటి, వెంకీ, రష్మీ, రాకెట్ రాఘవ, వర్షిణి, అభి, తాగుబోతు రమేశ్.. లాంటి వాళ్లంతా వచ్చి ఈవెంట్ ను మాత్రం సూపర్ డూపర్ గా హిట్ చేశారు.
ఇక.. ఈవెంట్ ప్రారంభంలో అనసూయ వేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ మామూలుగా లేదు. పీక్స్ ఇక. తన క్యాస్టూమ్స్ అదుర్స్. డ్యాన్స్ ఇంకా అదుర్స్.
మొత్తం మీద బుల్లితెర అభిమానులను ఈ ఈవెంట్ తో బాగానే మెప్పించారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి.