Anasuya: ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో గురించి అలాగే అందులో ఉన్న యాంకర్స్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. వారి గురించి వచ్చే వార్తలు సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతుంటాయి. ఇటీవల జబర్దస్త్ యాంకర్ అనసూయ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా లో లైవ్ కి వచ్చి మరీ తన అభిమానులతో పంచుకుంది. ఈ అరుదైన గౌరవం లభించడం వలన ఆమె చాలా సంతోషపడిపోతున్నట్లు కనిపిస్తోంది.
సాధారణంగా పెళ్లి తరువాత హీరోయిన్లు కానీ యాంకర్స్ కానీ వెండితెరకు అలాగే బుల్లితెరకు దూరం అయిపోతూ ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా అనసూయ కెరీర్ మాత్రం పెళ్లి తరువాతే పుంజుకుందని చెప్పాలి. ఆమె పెళ్లి తరువాతే జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా అనసూయ పేరున ఓ పోస్టల్ స్టాంప్ విడుదల అవ్వడంతో ఈ అరుదైన గౌరవం దక్కినందుకు ఆమె ఫుల్ ఖుషి అయిపోయారు.
ఇటీవల తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అందాల భామ అనసూయను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంపుతో ను రిలీజ్ చేసింది. ఆ స్టాంపు ఆమె ఫోటోతో ఉంది. ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని విదేశీ ప్రభుత్వాలు కూడా వారికి కొంత మొత్తం చెల్లిస్తే వారి ఫోటోతో ఉన్న పోస్టల్ స్టాంప్ను తయారు చేసి వారికి ఇస్తున్న తరుణంలో అనసూయ పోస్టల్ స్టాంప్ను కూడా చిత్రపురి చలన చిత్రోత్సవం వాళ్లు ఇదే విధంగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇది చుసిన ఆమె ఒక్కింత భావోద్వేగానికి గురయ్యిందనే చెప్పాలి.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.