తెలుగు టాప్ యాంకర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది అనసూయ. ఎప్పుడు బుల్లితెర మీద సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అనసూయ మొదటిసారి చాలా ఎమోషనల్ అయింది. అది చూసిన అందరు ఎమోషనల్ కి గురయ్యారు. అందుకు కారణం అనసూయ కి వాళ్ళ అమ్మ గుర్తు రావడమే. ఒక్కసారిగా గతంలో జరిగిన విషయాలన్ని కళ్ళ ముందు కనిపించాయి. కన్నీళ్ళు పెట్టించాయి. మాకోసం కోసం అమ్మ ఎంత స్ట్రగుల్ పడిందో అంటూ ఎమోషనల్ అయ్యింది.
అయితే అనసూయ అంతగా భావోద్వేగానికి గురవ్వడానికి కారణం ఆలీ. తాజాగా అనసూయ ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, చిన్నప్పటి జీవితం ఎలా గడిపింది.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది అనసూయ. మేముము ముగ్గురు ఆడపిల్లలం, మమ్మలిని చదివించడం కోసం అమ్మ కుట్టుమిషన్ నడిపించింది. చీరలకు పాల్స్ కుట్టి మరీ చదివించింది, ఆ సమయంలో అమ్మ పడ్డ స్ట్రగుల్స్ తలచుకుంటే ..అంటూ ఎమోషనల్ అయిపోయింది.
ఇక అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా ఇంటి అద్దెలు కట్టలేక తక్కువ అద్దెకు దొరికే ఇళ్లకు మారిపోయేవాళ్ళమని తెలిపింది. అప్పుడు తమ ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో యాభై పైసలు అదా చేయడానికి రెండు బస్టాప్లు నడిచి బస్సు ఎక్కేదాన్ని అని కన్నీళ్ళు పెట్టుకుంది అనసూయ. టీవీ తనకు అమ్మ అని, సినిమా నాన్న అని చెప్పింది. “రంగస్థలం” లో రంగమ్మత్త పాత్రని పేరు కోసమే చేశానని, జీవితంలో ఎప్పుడైనా కు థ్యాంక్స్ చెప్పాలనుకునే వ్యక్తి అడవిశేషు అని చెప్పింది. కాగా అనసూయ సినిమాల్లోకి రాకముందు విజువల్ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేసిందట. ప్రస్తుతం ‘పుష్ప’, ‘ఆచార్య’, ‘రంగమార్తాండ’ సినిమాలు చేస్తుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోయో కొందరికి ఘాటుగా సమాధానమూ చెప్తుంటుంది.