బుల్లితెర టాప్ కామెడీ షో జబర్దస్త్ లో హాట్ యాంకర్ అనసూయ కెరీర్ ప్రస్తుతం చాలా సక్సెస్ఫుల్గా సాగిపోతోంది. ఇటు హాట్ యాంకర్గా పేరు తెచ్చుకుని బుల్లితెరపై హంగామా చేస్తూ అటు వెండితెరపై కూడా తన నటనతో సత్తా చాటుతోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. రంగమ్మత్తగా రంగస్థలం సినిమాలో అనసూయ పెర్ఫార్మన్స్ కి ఆమెకి సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్యారెక్టర్ ఆమె కెరీర్కి బాగా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అనసూయ వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అనసూయ కి సునీల్ సరసన నటించే క్రేజీ ఆఫర్ ఒకటి దక్కిందని టాక్ వినిపిస్తుంది.
తన కెరీర్ మొదటిలో కమెడియన్గా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీల్ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. సునీల్ తదుపరి చిత్రం ‘వేదాంతం రాఘవయ్య’. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట మరోయు గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సి. చంద్రమోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథను అందిస్తుండటం విశేషం. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడాపూర్తయ్యాయి. ఈ మూవీలో హీరోయిన్ రోల్ చాలా కీలకమైనదట. అందుకే ఈ రోల్ కోసం అనసూయను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్ర బృందం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అంతే కాకుండా ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. పాత్ర పరిధి అలాగే రెమ్మ్యూనరేషన్ రెండూ నచ్చడంతో అనసూయ వెంటనే ఈ సినిమాకు ఒప్పుకుంది అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.