Anasuya : అనసూయ, రష్మీ, వర్షిణి ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..లేదా ఎవరైనా మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నారా అంటే ప్రముఖ నిర్మాణ సంస్థ ఇందుకు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తోందని తెలుస్తోంది. థియేటర్స్ లో సినిమాల కంటే డిజిటల్ ప్లాట్ ఫాంస్ అంటే ఓటీటీ ప్లాట్ ఫాంస్ లో సినిమాలకి ఆదరణ విపరీతంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. ఎంత కావాలంటే అంత చూపించవచ్చు. నో సెన్సార్ కాబట్టి ఎంత బోల్డ్ కంటెంట్ అయినా వేసుకోవచ్చు. జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది.
దీనిని దృష్ఠిలో పెట్టుకొనే మల్లెమాల వారు ఓ అద్భుతమైన వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. అయితే వెబ్ సిరీస్ ఎక్కువగా హిందీలో వర్కౌట్ అవుతున్నాయి గానీ మన తెలుగు భాషకొచ్చే సరకి తేడా కొడుతున్నాయి. కొన్ని యూనివర్సల్ కంటెంట్స్ కూడా మన వాళ్ళను మెప్పించడం లేదు. సినిమాకి సెన్సార్ ఉంటుంది కాబట్టి ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్ అయినా పరిధి దాట కూడదు. పర్ఫార్మెన్స్, డైలాగ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ సెన్సార్ సమస్యలు వెబ్ సిరీస్ లకి ఉండటం లేదు. అందుకే రెగ్యులర్ గా కమర్షియల్, కామెడీ సినిమాలు కాకుండా వేరే ట్రై చేస్తున్నారు.
Anasuya : ఒకే ఫ్రేమ్ లో అనసూయ, రష్మీ, వర్షిణిని చూస్తే అభిమానులకి పండుగే.
ఇందులో భాగంగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, ఈషా రెబ్బ, ప్రియమణి, రాధిక ఆప్టే, టబు, నిత్యా మీనన్ లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ అందరూ వెబ్ సిరీస్ లలో నటించడానికి తహ తహలాడుతున్నారు. అందుకే హాట్ యాంకర్స్ గా పాపులారిటీ ఉన్న రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ లతో పాటు వర్షిణి సౌందరాజన్ లతో ఓ డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న వెబ్ సిరీస్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసిన వీరు ముగ్గురు ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్స్ మాదిరిగా క్రేజీ వెబ్ సిరీస్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒకే ఫ్రేమ్ లో వీరిని చూస్తే ఇక అభిమానులకి పండుగే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?