Anasuya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ముఖ్యంగా జబర్దస్త్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమయిన పేరు యాంకర్ అనసూయ. ఈమెకు సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాన్స్ ఉన్నారు. అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టి అక్కడ కూడా తన నటనతో ఎంతోమంది మన్ననలను పొందింది. అయితే ఈమె నటనకు గాను సినిమాలలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో అనసూయ తన అభిమానులకు ఓ బాడ్ న్యూస్ చెప్పింది.
ఇక నుంచి ఆ పని చేయనంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ అనసూయ ఏ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అని ఆలోచిస్తున్నారా? అదేమిటంటే…. ఇక నుంచి ఆమె సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కనిపించదట. అనసూయ ఓ వైపు జబర్దస్త్ లో చేస్తూనే మరో వైపు సినిమాలలో కూడా నటిస్తూ సక్సెస్ అయ్యింది. అనసూయ మొదటి సారిగా నాలుగేళ్ల క్రితం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ సినిమాలో సూయ సూయ సూయ అనసూయ అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించింది అనసూయ. తాజాగా అనసూయ హీరో కార్తికేయ నటిస్తోన్న చావు కబురు చల్లగా సినిమా లో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు.
ఇటీవల అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంటర్వ్యూయర్ “మీరూ ఫ్యూచర్ లో కూడా నూ స్పెషల్ సాంగ్లలో కనిపిస్తారా అని ప్రశ్నించగా ఇకపై స్పెషల్ సాంగ్స్ లో చేయనని కచ్చితంగా చెప్పేసింది అనసూయ. చావు కబురు చల్లగా సినిమా లో స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆయన తన స్నేహితుడు కాబట్టి ఆయన అడిగినందుకు చేశానని అనసూయ స్పష్టం చేశారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.