ఒక్కోసారి ఒక్కో వార్త ఎలా పుట్టుకొస్తుందో ఎవరికీ అర్థం కాదు. టాప్ మీడియా సైతం అంతా తనకు తెలిసినట్లు వార్తలు రాసేస్తుంది.అదే సెలబ్రిటీ యాంకర్ అనసూయ విషయంలో జరిగింది.
ఆమె తమిళంలో సిల్క్ స్మిత బయో పిక్ లో నటిస్తోందంటూ వార్తలు హల్చల్ చేశాయి.టీవీ యాంకర్ గానే కాక నటిగానూ ప్రూవ్ చేసుకుంది అనసూయ. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో తన నటనకి ప్రేక్షకుల నుండి కాంప్లిమెంట్స్ దక్కాయి. ఇప్పుడామె మరో అడుగు ముందుకేసి తమిళంలోనూ నటిస్తోంది.౨ ఇటీవల ఆ మూవీ షూటింగ్ నుండి ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మరో మంచి కథ.. న్యూ బిగినింగ్.. కోలీవుడ్.. తమిళ్’ అనే హ్యాష్ ట్యాగ్స్ ని ఆ ఫొటోకి యాడ్ చేసింది. నిజానికి అంతకు ముందే విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఓ ఫొటోని అనసూయ షేర్ చేసింది. కానీ సేతుపతి ఫొటో కంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోనే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది.
ఇందుకు కారణం.. ఆ ఫొటో ఒకప్పటి సిల్క్ స్మిత ఫొటోని పోలి ఉంది. దీంతో సిల్క్ స్మిత బయోపిక్లో అనసూయ నటిస్తోంది అనే టాక్ మొదలైంది.ఫొటో రిఫరెన్స్ సిల్క్ స్మిత అని ప్రత్యేకంగా మెన్షన్ చేసిన అనసూయ, అది బయోపిక్ అవునా కాదా అనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఇది సిల్క్ సినిమానే అని కన్ఫర్మ్ చేస్తూ వార్తలు పుట్టు కొస్తున్నాయి.సిల్క్ స్మిత పాత్రకు అనసూయ అన్ని విధాల సరిపోతుందని కామెంట్లు వచ్చేశాయి.ప్రస్తుతం 35 ప్లస్ ఏజ్లో ఉన్న అనసూయకు అది కూడా అడ్వాంటేజే!ముఖ ఆకృతి కూడా సిల్కుస్మితను పోలి ఉంటుంది. డ్యాన్స్ లు కూడా బాగా చేస్తుంది.కాబట్టి ఆ పాత్రకు అనసూయ న్యాయం చేయగలదని సినీ ప్రముఖులే అంతర్గత చర్చల్లో మాట్లాడుకున్నట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో అనసూయ స్పందించింది.తాను సిల్క్ స్మిత బయోపిక్ చేయడం లేదని ఆమె ట్వీట్ చేసింది.అందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపింది.దీంతో ఆ ఊహాగానాలకు ఆమె తెరదించినట్లయింది ప్రస్తుతం అనసూయ రవితేజ హీరోగా నిర్మాణంలో ఉన్న కిలాడీ ,కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగ మార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు.ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్యూ బ్రదర్ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇద్దరు పిల్లల తల్లయినప్పటికీ ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై వెలిగిపోవడం అనసూయ కే చెల్లింది.