Anchor Anasuya: అనసూయ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే మరి. ఓ సాధారణ టీవీ యాంకర్ సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ వేసే స్థాయికి చేరుకుందంటే ఆమెను మనం అభిమండించకుండా ఉండలేము. అవును.. రంగస్థలం సినిమాలోని ‘రంగమ్మత్త’ క్యారెక్టర్ కి ఆమె ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనిలేకుండా పోయింది. ఇకపోతే అనసూయ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ తన అభిమానులకు అతి చేరువలో వుంటుందనే చెప్పుకోవాలి.
Samantha: నాగ చైతన్య తో పెళ్లికి సంబంధించిన చీరను సమంత ఏం చేసిందో తెలుసా..??
Anchor Anasuya: తాజాగా జరిగింది ఇదే:
ఇకపోతే ఆమె పెట్టే ట్వీట్లు, షేర్ చేసే ఫోటోలు అప్పుడప్పుడు కాసింత కాంట్రవర్సీకి దారి తీస్తాయనే చెప్పుకోవాలి. ఇక అనసూయను ట్రోల్స్ చేసే సమయంలో మన జబర్దస్త్ హైపర్ ఆది వంటివారిని కూడా మధ్యలోకి లాగి గిల్లికజ్జాలు పెడుతూ వుంటారు. అయితే తాజాగా అనసూయ ఓ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ వేసిన ట్వీట్ వైరల్ అయింది. ఉమెన్స్ డే అంటూ ట్వీట్ వేయకుండా.. ట్రోలర్స్, మీమర్స్ మీద సెటైర్లు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
Anchor Anasuya : అమ్మో యాంకర్ అనసూయ అరాచకమైన ఫోటో.. కుర్రాళ్ళు ఇంక ఎక్కడ ఆగుతారు!
విషయం ఏమంటే?
అది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం… “ట్రోలర్స్, మీమర్స్ కి సడెన్ గా ఈ రోజు మహిళలంటే విపరీతమైన గౌరవం వచ్చినట్టుందే.. అయినా అది 24 గంటల్లో పోతుంది!” అని కౌంటర్ వేసింది. దీనిపై నెట్టింట్లో రచ్చ రచ్చ జరిగింది. అనసూయ మీద నెటిజన్లు కామెంట్లతో దాడి చేశారు. కాసేపటి తరువాత మరో ట్వీట్ వేసింది అనసూయ. గుమ్మడి కాయ దొంగలు అంటూ మరో ట్వీట్ వేసింది. అయితే అనసూయను మాత్రం నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేసేశారు.