ఈటీవీ జబర్దస్త్ ద్వారా బుల్లితెర మీద స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యాంకర్లలో జాబితాలో అనసూయనే ముందు ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో అనసూయకు ఏంతో క్రేజ్ ను సంపాదించి పెట్టిందని చెప్పొచ్చు. ఈమె తన కెరీర్ ని న్యూస్ రీడర్ గా మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన్నపటికి జబర్దస్త్ మాత్రం అనసూయ కెరీర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఈ క్రేజ్ ను ఉపయోగించుకుంటూ ఆమె వెండితెర మీద తన నటనతో తన సత్తాను చాటింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త గా అనసూయ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటినుంచి ఆమెకు ఆఫర్లు కొదవులేకుండా వస్తున్నాయి. అయితే కొన్ని కారణాల వల్లజబర్దస్త్ నుంచి విడిపోయి జీ తెలుగులోకి వెళ్లిన నాగబాబు అనసూయను కూడా జీ తెలుగులోకి రప్పించేందుకు చాలా ట్రై చేశారట. అప్పటిలో ఆమె జబర్దస్త్ ను వదిలివెళ్ళిపోతారేమో అనే అనుమానం అందరికీ వచ్చింది.
అనసూయ కూడా అందుకు మగ్గు చూపినట్లు సమాచారం. కానీ జబర్దస్త్ జడ్జి రోజా ఇంటర్ఫేర్ అవవడంతో అనసూయ మనస్సు మార్చుకున్నదట. ప్రస్తుతం ఇంత సక్సెస్ ఫుల్ గా టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ను పూర్తిగా విడిచిపెట్టి కొత్త ప్రోగ్రాంలోకి వెళ్ళి సక్సెస్ అవ్వడం అంటే కష్టమేనని రోజా సలహా ఇచ్చారట. అందుకే అనసూయ జబర్దస్త్ ను వదులుకోకుండానే, జీ తెలుగు లో ఒక ప్రోగ్రాంకు ఒకే చెప్పిందట. జీ తెలుగు లో లోకల్ గ్యాంగ్స్ పేరుతో స్టార్ట్ అయిన ప్రోగ్రాం అనుకున్నంత రేటింగ్ రాకపోవడంతో నిర్వాహకులు దాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అనసూయకు రోజా ఇచ్చిన సలహా ప్లస్ అవ్వడంతో అనసూయ రోజాకు చాలా కృతజ్ఞతగా ఫీల్ అయినట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!