బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపంట్స్ కు బయట పెద్ద కెరీర్ ఉండట్లేదు. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు గడిచినా కానీ బిగ్ బాస్ లో ఫేమ్ సంపాదించుకుని బయటకు వచ్చాక అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అయినా కానీ బిగ్ బాస్ అనగానే చాలా మంది ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం వాళ్లకు అందుతున్న పారితోషికాలు.
బిగ్ బాస్ ఫార్మాట్ ప్రకారం ఎక్కువ రోజులు ఉన్న వాళ్లకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ పారితోషికాలు రోజుల పరంగా లెక్కగట్టి ఇస్తారు. అందుకే పార్టిసిపంట్స్ ఎక్కువ రోజులు ఉండేలా గేమ్ ఆడటానికి ఏం చేయడానికైనా వెనుకాడరు. మిగతా సీజన్ల సంగతి సరే కానీ ఈ సీజన్ బిగ్ బాస్ కొంత కొత్తగా అనిపిస్తోంది. బయట ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ లో పాల్గొనడానికి వెనుకాడారు. దీంతో ఈసారి చాలా మంది కొత్త ముఖాలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరి వారి వారి రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయన్న సందేహాలు రావడం సహజం.
మరి ఒకసారి వాటిపైన లుక్ వేస్తె… అందరికంటే ఎక్కువగా యాంకర్ లాస్య బిగ్ బాస్ హౌస్ లో పారితోషికం అందుకుంటోంది. ఆమెకు రోజుకు 1 లక్ష చొప్పున చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమ్మ రాజశేఖర్, నోయెల్, మోనాల్ గజ్జర్ లకు రోజుకు 50 వేల చొప్పున రేటు ఫిక్స్ చేసారు. సూర్యకిరణ్, దివి, గంగవ్వ, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, అభిజీత్ లకు రోజుకు 25 వేలు రెమ్యునరేషన్. మిగిలిన వారందరికీ రోజుకు 10 వేల చొప్పున చెల్లిస్తోంది బిగ్ బాస్. వైల్డ్ కార్ట్ ఎంట్రీ కుమార్ సాయికి కూడా రోజులు 10 వేలు చెల్లించనున్నారు. ఇక హోస్ట్ గా శనివారం, ఆదివారం మాత్రమే వచ్చే నాగార్జున ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నాడని తెలుస్తోంది.