ఈరోజుల్లో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో? టీవీల్లో వచ్చే షోలకు కూడా అంతే క్రేజ్. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాల కన్నా.. షోలకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్.
బుల్లి తెరపై ఏ షో సక్సెస్ కావాలన్నా.. ఆ షోలో కొత్తదనం ఉండాలి. యాంకర్లలో స్పాంటెనిటీ ఉండాలి. మొత్తం మీద ఆ షో జనాలను ఎంటర్ టైన్ చేయగలగాలి. అయితే.. ఒక డ్యాన్స్ షోగా మొదలైన ఢీ మాత్రం బుల్లి తెర అభిమానులకు ఓవైపు డ్యాన్స్ ను అందిస్తూనే మరోవైపు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది.
ఢీ షోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాంకర్ ప్రదీప్ గురించి, జడ్జిలు ప్రియమణి, పూర్ణ, శేఖర్ మాస్టర్ గురించి. వీళ్లు లేకుంటే ఢీ షోనే లేదు. తర్వాత సుడిగాలి సుధీర్, రష్మీ, వర్షిణి వచ్చి చేరారు. హైపర్ ఆది కూడా వస్తున్నాడు అప్పుడప్పుడు.
ఇక.. షోలో వీళ్ల సందడి మామూలుగా ఉండదు. షోలో కెమిస్ట్రీ బాగా పండాలంటే ఖచ్చితంగా సరదాగా కొన్ని స్కిట్లు అవీ ఇవీ చేస్తుంటారు. కానీ.. తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోమోలో ఓ నిజం బయటపడింది.
ఓ కంటెస్టెంట్.. పూర్ణలా మారి.. డ్యాన్స్ చేసింది. ప్రదీప్ ను చూసుకుంటూ.. ప్రదీప్ ను ఇష్టపడుతున్నట్టుగా డ్యాన్స్ చేసింది. తన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ అయిపోయాక.. పూర్ణ.. తన డ్యాన్స్ బాగుందని.. నిజమే.. తనకు ప్రదీప్ మీద క్రష్ ఉందని తన మనసులో మాటను బయటపెట్టేసింది. దీంతో షోలో ఒకటే నవ్వులు.
వెంటనే ఇద్దరూ స్టేజి మీదికి వచ్చి రొమాంటిక్ లుక్ తో డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మొత్తం షో ఎపిసోడ్ విడుదలయితే కానీ తెలియదు అసలు సంగతి ఏంటో? మొత్తానికి అలా ఢీలో మరో జంట కెమిస్ట్రీ వర్కవుట్ అయిందన్నమాట. ఢీ షోకు సంబంధించిన ప్రోమో చూస్తారా?