Indian traditions: మన ప్రాచీన భారత దేశ సాంప్రదాయాల Indian traditions ప్రకారం పెద నాన్నగారు, పిల్లనిచ్చినమామ గారు,గురువు గారు ఈ ముగ్గురు తండ్రి తో సమానం.కనుక ఈ ముగ్గురిని తండ్రి లాగే పూజించాలి. మగ పిల్లల పేర్ల అక్షరాలు సరి సంఖ్య లో ఆడ పిల్లల పేర్ల అక్షరాలు బేసి సంఖ్య ల్లో నూ ఉండాలి. ఒకసారి కట్టి విడిచిన బట్ట లని ఉతకనిదే మరల వేసుకోకూడదు.
నిద్ర నుండి మెలకువ వచ్చినతర్వాత పక్కమీద దొర్లుతూ పడుకుని ఉండరాదు.
- స్నానం చేసాక శరీరాన్నితడిలేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.పూర్తిగా తుడుచుకోకుండా తడి మీద వస్త్రాలు వేసుకుంటే దరిద్రుడవుతాడు.
- శరీరాన్ని సరిగా రుద్దుకోకుండా సరిగా స్నానం చేయకుండా సగం, సగం స్నానం చేయడం మహాదోషం.శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుంటూ స్నానం చేయనివారు పందులుగా పుడతారు.
- దీపారాధన చేసాక అందులో అగరుబత్తి , కర్పూరం వంటివి గృహస్తులు వెలిగించకూడదు.పీఠాలు ,ఆలయాలకు ఈ నియమం వర్తించదు.
- ఒకసారి వెలిగించాకా ఏ కారణం చేతనయినా దీపారాధన కొండెక్కితే, అప్పుడు ఆ వత్తిని తీసేసి కొత్త వత్తు వేసి మరల వెలిగించాలి, కానీ పాత వత్తినే మరల వెలిగించరాదు.
- లాగులు(షార్ట్స్) ధరించి పూజ చేయరాదు.ఇది పెద్దవారికే కానీ పిల్లలకు వర్తించదు.
- రేపు చేయవలిసిన పనిని ఈ రోజు,ఈ రోజు పనిని ఈ క్షణమే చేయాలి.వాయిదా పనికి రాదు.
- వయ్యస్సు లో పెద్దవారికంటే విద్యలో పెద్ద వారికి ముందుగా పూజ చేయాలి.
- ఒక చెట్టుని నరికే ముందు మూడు చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు.
- నదిలో ఉమ్మడం,ముక్కు చీదడం, చిల్లర డబ్బులు వేయడం దోషం. నది స్నానం కి వెళ్ళినప్పుడు మూత్రానికి వెళ్లివచ్చి చెంబుతో నీళ్లు తీసుకుని దూరంగా వెళ్లి కాళ్ళు కడుక్కుని అప్పుడు నదిలో దిగాలి.కాళ్ళు కడుక్కోకుండా నేరుగా నదిలో దిగకూడదు. మల విసర్జన తర్వాత బయటే కడుక్కోవాలి కానీ నేరుగా నదిలోకి వెళ్లి కడుక్కోవడం మహా దోషము. అలా చేయడంవలన రోగ జన్మలకు కారణమవుతాయి.కాబట్టి ఎట్టి పరిస్థితులలో నదుల్లో పొరపాటున కూడా ఇలాంటిపనులు చేయకండి.
- కాళ్ళు కడుక్కునే టప్పుడు చాలామంది కాలు మీద కాలు పెట్టి రుద్ది కడుగుతుంటారు.ఇలా చేయడం వలన దరిద్రం చుట్టుకుంటుంది.వంగి చేతితో రుద్దిమాత్రమే కడుక్కోవాలి.
- ఒడిలో కంచం పెట్టుకుని ఏ పదార్ధాలు తినకూడదు.
- కాళ్ళతో ఆసనాలు లాగరాదు, అంటే చాపలు, కుర్చీలు వంటివి.
- చీటికీ మాటికీ తనను తానూ అవమానించుకోవడం, నిందించుకోవడం, తిట్టుకోవడం, తక్కువ చేసుకుని మాట్లాడటం వంటివి చేయరాదు.
- నగ్నం గా ఉండి చదవడం, నడవడం వంటివి చేయరాదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?