Food: పాశ్చాత్య సంస్కృతి మన భారతీయులకు నిలబడి ఆహరం తినడం నేర్పింది కానీ నిజానికి మన భారతీయులు నేలపై కూర్చుని ఆహారాన్ని తీసుకుంటారు. నేటి తరం వారు కూడా పాశ్చాత్య సంస్కృతి ని ఆచరిస్తూ ఈ మార్గంలోనే వెళ్తున్నారు కానీ అది సరైన పద్ధతి కాదు.
పూర్వం భోజనం చెయ్యడానికి చాలా నియమాలను పాటిస్తూ ఉండేవారు. ఆవు పేడతో అలికి ఉన్న నేలపై అరటి ఆకులో అన్నం వడ్డించుకుని బాసేంపట్లు వేసుకుని కూర్చుని ఆహారాన్ని తీసుకోవడం మన సాంప్రదాయం. కానీ నేటి కాలంలో కుర్చీలపై కూర్చుని, కాళ్ళకు చెప్పులు అలాగే ఉంచుకుని, దుస్తులు బిగుతుగా బిగించబడి ఉన్న ప్రతికూల విధానంలో, టీవీ చూస్తూనో కంప్యూటర్ నొక్కుతూనో మనం తింటున్నాం. ఇలా బాహ్యంగా ఆహ్లాదకరంగా కనిపించే పద్ధతులు మనల్ని తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తున్నాయి.
ఆధునిక వైద్య శాస్త్రం తెలియజేసిన సమాచారం ప్రకారం మనం తింటున్నప్పుడు శరీరంలోని కీళ్ళు కావలిసినంతగా కదలికలు పొందుతాయి. నిలబడి తినడం లాంటి అలవాట్లు కీళ్ళకు ఎక్కువ శ్రమను కలిగిస్తాయి. అదే కూర్చుని తినడం వలన ఈ కీళ్ళకు శ్రమ కలగకుండా ఉంటుంది.
అలాగే నిలబడి తినడం వలన ఎక్కువ ఆహరం తినడం జరుగుతుంది. అతిగా తినడం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలిసిందే. అలా తినడం వలన అధిక కొవ్వు శరీరంలో చేరి అది ఊబకాయం కు దారితీస్తుంది. అతి ఆహరం గాని ఎక్కువ మోతాదులో కానీ ఆహరం తీసుకోవడం వలన అది రోగాలకు రాచబాట వేస్తుందనేది జగమెరిగిన సత్యమే! ఈ విషయాన్నీ ఆరోగ్య నిపుణులు మరియు డాక్టర్లు వెల్లడించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కాబట్టి కూర్చుని ముఖ్యంగా కింద కూర్చుని ఆహరం తినడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి.