ఏపిలో పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. 2023 ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు టెన్త్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఏపి పాఠశాల విద్యా కమీషనర్ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేశారు. ఆరు సబ్జెక్ట్ లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు తెలిపింది. అలాగే ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షా సమయంగా నిర్ణయించారు. సీబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షలకు సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అంటే రూ.125ల పరీక్షా రుసుముతో ఈ నెల 24వ తేదీ వరకూ ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులను స్వీకరించగా, 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 29వ తేదీ వరకూ ధరఖాస్తులను స్వీకరించారు. ప్రస్తుతం జనవరి 3వ తేదీ వరకూ 200 రూపాయల అపరాధ రుసుముతో, ఆ తర్వాత 9వ తేదీ వరకూ రూ.500లు అపరాధ రుసుముతో ధరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకూ 26వ జిల్లాల నుండి 6,60,859 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. కేజీబీవీ పాఠశాల విద్యార్ధులు, దివ్యాంగులకు పరీక్షా రుసుము నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
పదవ తరగతి పరీక్షల టైం టేబుల్
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లీషు
ఏప్రిల్ 10 లెక్కలు
ఏప్రిల్ 13 సైన్స్
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి.
ఏప్రిల్ 17 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1
ఏప్రిల్ 18 ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) వోకేషనల్ కోర్సు పరీక్ష ఉండనుంది.