ఆ హీరో 18 ఏళ్లుగా సినీ ఫీల్డ్ లో ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు! అతని ఖాతాలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి!
కానీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో తనకు తెలియదని ఒక పోలీస్ అధికారి పుసుక్కున అనేసాడు!ఇదే ఇప్పుడు టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్! వివరాల్లోకి వెళితే ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి రమేష్ హాస్పిటల్స్ విజయవాడ స్వర్ణా ప్యాలెస్ హోటల్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి పదిమంది మృతువాత పడిన విషయం తెలిసిందే!ఈ సంఘటన జరిగిన వెంటనే రమేష్ హాస్పిటల్స్ యజమాని పారిపోయాడు పోలీసులు లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు!ఏకంగా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు!అనేక ట్వీట్లు వదిలారు! జగన్ పై ఏదో కుట్ర జరుగుతోందని కలరింగ్ ఇచ్చారు.జగన్ కింద పని చేసే వారే జగన్ డ్యామేజ్ దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు అని కామెంట్ చేశారు.హీరో రామ్ వ్యాఖ్యలు కొద్ది సేపు కలకలం రేపాయి!అసలు ఈ సంఘటనకి హీరో రామ్ కి సంబంధం ఏమిటా అని అని ఆరాలు మొదలయ్యాయి!ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్ యజమాని రమేష్ పోతినేని రామ్ కి స్వయాన బాబాయి అని వెలుగులోకొచ్చి౦ది.
కాబట్టి రామ్ స్పందించారు అనుకున్నారు. అయితే రామ్ వ్యాఖ్యలపై విజయవాడ ఏసిపి సూర్యచంద్రరావు స్పందనే డిఫరెంట్ గా ఉంది!అసలా రామ్ ఎవరో తనకు తెలియదని ఏసిపి చెప్పేశారు!కరోనా రోగులను రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వర్ణా ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో ఉంచి దోచుకుందని ఏసిపి తెలిపారు.క్వారాంటైన్ సెంటర్,. కొవిడ్ సెంటర్ వేరు అని అన్నారు.
క్వారంటైన్ సెంటర్ ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులను అబ్జర్వేషన్ లో ఉంచేలా, రోజుకి 2000 వేల రూపాయలు వసూలు చేస్తారు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.హాస్పిటల్ యజమాని పరారవడమే ఆయన తప్పుందని చెప్పడానికి నిదర్శనమని ఎసిపి తెలిపారు. ఆ రామ్ ఎవరో?ఎందుకు స్పందించాడో తనకు తెలియదని ఏసిపి వ్యాఖ్యానించటం ఈ మొత్తం ఉదంతానికి హైలెట్!