కరోనా వ్యాప్తి దేశంలో ఇంకా ఎక్కడా తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు. రోజూ దాదాపు 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య రోజుకు 100కు దగ్గర్లో ఉంది.
మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ కరోనా టెస్టుల విషయంలో ముందంజలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కరోనా టెస్టుల విషయంలో మరో మైలురాయిని అందుకుంది. ప్రతి 10 లక్షల మందిలో 50 వేల టెస్టులను పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్. ఈ క్రమంలో ఇది సాధించిన తొలి మేజర్ రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ 27,05,459 టెస్టులను పూర్తి చేసుకుంది. కరోనాను ఎదుర్కోవడంలో జగన్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.