(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
హైదరాబాద్లో ఏపికి చెందిన అటవీశాఖ ఉన్నతాధి ఒకరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వి భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్లో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ అయిదవ ఫ్లోర్ నుండి రమణమూర్తి దూకేయడంతో మృతి చెందారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉన్నది. రమణ మూర్తి 1987 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?