ఆంధ్రప్రదేశ్ లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. తన వద్దకు వచ్చిన సీఆర్డీఏ, వికేంద్రీకరణ (3 రాజధానుల బిల్లు) పై ఆమోద ముద్ర వేశారు గవర్నర్. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అన్నది అధికారికమైనట్లైంది.
గత నెలలో ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోద ముద్ర పొందాయి. దీంతో ఇక మూడు రాజధానులు అన్న అంశం లాంఛనమే అయింది. నెల రోజులు గడిచాక నిబంధనల ప్రకారం కొద్ది రోజుల క్రితం ఈ రెండు బిల్లులు గవర్నర్ వద్దకు చేరాయి. ఇప్పుడు ఈ రెండు బిల్లులను గవర్నర్ ఆమోద్ర ముద్ర వేస్తూ సంతకం చేసారు. దీంతో ఇకపై శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి.