ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించనున్నారు. రేపు అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాలను కలిపి విడుదల చేయనున్నారు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలకు గాని ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు గాను తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఇక పోతే లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా ఉన్నప్పటికీ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.
మరోవైపు పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించి తీరుతామని విద్యాశాఖా మంత్రి ఆది మూలపు సురేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ, తమిళనాడు మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి గ్రేడ్ల ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేస్తామని చెప్పినప్పటికీ ఏపీ లో మాత్రం ఖచ్చితంగా పదవతరగతి పరీక్షలు పెట్టి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.