ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ.. Andhrapradesh food processing పీఎం ఎఫ్ఎంఈ PM FME స్కీం ద్వారా జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 50
విభాగాలు : జిల్లా రిసోర్స్ పర్సన్
అర్హతలు : ఫుడ్ టెక్నాలజీ లో డిప్లొమా, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు : 45 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం :
ఈ పరీక్ష లో 4 విభాగాల నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు నిర్వహిస్తారు.
1.ఫుడ్ టెక్నాలజీ – 50 మార్కులు
2.డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ – 20 మార్కులు
3. ఫండమెంటల్స్ ఆన్ ఫైనాన్షియల్ అనాలసిస్ – 15 మార్కులు
4. ఐక్యు – 15 మార్కులు
ఈ విభాగల నుంచి ఈ విధంగా ప్రశ్న పత్రం ఇస్తారు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది : 23/1/2021
పరీక్షా తేది : 31/1/2021
వెబ్ సైట్ : https://apfs.com/recruitment-of-district-resource-persons/
ఇది కూడా చదవండి : టీమిండియా విజయం పై ప్రముఖుల ప్రశంసల వెల్లువ ..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?