ఎఫ్ 2 సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సమపాళ్ళలో చూపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ భారీ హిట్ అందుకుంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్ళు రాబట్టి రికార్డ్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 రాబోతోంది. దిల్ రాజు – దర్శకుడు అనిల్ రావిపూడి – వెంకటేష్ – వరుణ్ తేజ్ ఈ భారీ మల్టీస్టారర్ కోసం సిద్దమవుతున్నారు.
ఇక దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్ 3 ఈ డిసెంబర్ లో ప్రారంభం కాబోతుందని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు డేట్ కూడా ఫిక్స్ చేశారట. డిసెంబర్ 14 న ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. రెగ్య్లర్ షూటింగ్ జరిపి 2021 సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆ సమయానికి గనక అనుకోని కారణాల వల్ల సినిమా కంప్లీటవకపోయినా లేదా భారీ లెవల్ లో కాంపిటీషన్ ఉన్నా దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నారట. ఇక ఎఫ్ 2 కి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కి సంగీతమనించబోతున్నాడని తెలుస్తోంది. అనిల్ రావిపూడి కూడా ఇప్పటికే ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్దం చేశాడట.
టాలీవుడ్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ టాప్ డైరెక్టర్ గా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో హీరోలకి సూపర్ హిట్ ఇచ్చాడు. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అఫే రేంజ్ లో ‘ఎఫ్ 3’ ఉండబోతోందని స్వయంగా చెప్పుకొచ్చాడు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలీదు..కాని జెట్ స్పీడ్ లో మా ఎఫ్ 3తో నవ్వుల వ్యాక్సిన్ వస్తుందని సరదా వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ని ఉత్సాహ పరచాడు అనిల్ రావిపూడి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?