టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అన్న సాలీడ్ హిట్ అందుకున్నాడు. ప్రేక్షకులు ఊహించిన భారీ హిట్ కాకపోయినప్పటికి మహేష్ రేంజ్ కమర్షియల్ సక్సస్ మాత్రం పడింది. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సక్సస్ ఫుల్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ ఎఫ్ 3 ని రూపొందించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ సీక్వెల్ లో మహేష్ నటించబోతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే అనూహ్యంగా ఈ పాజెక్ట్ కి బ్రేక్ పడింది. ఈ లోపు కరోనా.. దాదాపు 7 నెలలు సినిమా ఇండస్ట్రీ లాక్ డౌన్ లో ఉండిపోయింది. దాంతో పరిస్థితులు ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని తారుమారయ్యాయి. అలానే అనిల్ రావిపూడి ఎఫ్ 3 కి బ్రేక్ పడింది. ఈ సినిమాలో చేయాల్సిన వెంకటేష్ నారప్ప సినిమాతో, వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాతో లాకయ్యారు. ముందు ఈ సినిమాలు కంప్లీట్ చేస్తే గాని వెంకీ, వరుణ్ కొత్త ప్రాజెక్ట్ కి రాలేరు.
ఈ మధ్యలో మహేష్ కూడా సర్కారు వారి పాట కమిటయ్యాడు. వచ్చే సమ్మర్ వరకు మహేష్ ఇంకో సినిమా చేయడం కూడా కష్టమే. అనిల్ కూడా బాలయ్య తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదని సమాచారం. అయితే తాజాగా అనిల్ రావిపూడి సాయి పల్లవి తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అనిల్ రావిపూడి ఓ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడట. ఆ స్క్రిప్ట్ కి సాయి పల్లవి అయితే పర్ఫెక్ట్ గా సూటవుతుందని తనతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది. సాయి పల్లవి డేట్స్ ని బట్టి దాదాపు మూడు నెలల్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి ఏప్రిల్ లేదా మే లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!