Annasuya : టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. ఈ షో ద్వారా ఎంతోమంది కుర్రకారు హృదయాలను అనసూయ Annasuya దోచుకోవటం జరిగింది. తన డ్రెస్సింగ్ స్టైల్ తో తన యాంకరింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల కుర్రోళ్ళు మతిపోయేలా వేదికలపై సెగలు రేపింది. ఈ దెబ్బతో ఈ ముద్దుగుమ్మకి ఇండస్ట్రీ వైపు నుండి కూడా అవకాశాలు రావడంతో ప్రస్తుతం రెండు రంగాలలో అటు టెలివిజన్ ఇటు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. అంత మాత్రమే కాక సోషల్ మీడియా లో అదిరిపోయే ఫోటో లు పెడుతూ కుర్రాళ్ల మతి పోగొడుతూ ఉంటది. అప్పుడప్పుడు వార్నింగులు కూడా ఇస్తూ ఉంటది.
ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ అనసూయ ఆర్ఎక్స్ 100 హీరో సినిమాల్లో చేయటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల లో సరికొత్త టాక్ వినపడుతోంది. మేటర్ లోకి వెళ్తే ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చేయటానికి అనసూయ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఈ ముద్దుగుమ్మ డిసైడ్ అయినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. గతంలో నాగార్జున సినిమాలో అదేవిధంగా మరి కొన్ని సినిమాలలో అనసూయ నటించడం జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్ర లో అనసూయ నటించిన నటన సినిమాకే హైలెట్ అయ్యింది. ఇలాంటి తరుణంలో కుర్ర హీరో కార్తికేయ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అనసూయ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో.. అనసూయ అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.