టర్కీ, సిరియాలను గత వారం భూకంపం సృష్టించిన ప్రళయం మరువక ముందే తాజాగా మరో సారి భూమి కంపించింది. గత వారం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం టర్కీ, సిరియాలను కుదిపివేసింది. నగరాలు, పట్టణాలు శ్మశానాలుగా మార్చింది. ఈ విలయం నుండి కోలుకోకముందే నిన్న టర్కీ దక్షిణ నగరమైన కహ్రమాన్మరాస్ లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మరో సారి భయాందోళన రేకెత్తింది. అయితే ఈ భూకంపం కారణంగా ఏమైనా నష్టం సంభవించిందా అన్న వివరాలు తెలియరాలేదు. మరో పక్క ఆప్ఘనిస్తాన్ లోని పైజాబాద్ లోనూ నేటి ఉదయం 6.47 గంటలకు భూకంభం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈశాన్య నగరమైన ఫైజాబాద్ కు ఆగ్నేయంగా వంద కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది.
మరో వైపు టర్కీ లోని హతాయ్ ఎయిర్ పోర్టు నుండి విమాన రాకపోకలు ప్రారంభమైయ్యాయి. టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిధిలాల కింద అణువణువు గాలిస్తున్న బృందాలు సజీవంగా ఉన్న వారిని వెలికి తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. టర్కీ, సిరియాల్లో శిధిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు నిన్న కూడా రక్షించాయి. భూకంప మృతుల సంఖ రోజురోజుకు పెరుగుతూ ప్రస్తుతం 34 వేలు దాటేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1939 లో టర్కీలో సంభవించిన భూకంపం కంటే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొంటున్నారు.
భూకంపం ధాటికి మరణించిన వేలాది మందిని ఖననం చేయడానికి టర్కీలోని అంతక్య ప్రాంతంలో తాత్కాలిక శ్మశానవాటిక నిర్మించారు. బుల్డోజర్లతో గుంతలను తవ్వి ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు మృతదేహాలతో అంబులెన్స్ లు, ట్రక్కులు.. శ్మశానవాటికకు నిరంతరాయంగా వస్తున్నాయి.
ఆ తొమ్మిది నియోజకవర్గాలపైనే టీడీపీ ఫోకస్ .. ఎందుకంటే..?
An earthquake with a magnitude of 4.3 on the Richter Scale hit 100km SE of Fayzabad, Afghanistan today at 6:47 am IST: National Centre for Seismology pic.twitter.com/Dc8pLrWzxe
— ANI (@ANI) February 13, 2023