ఇప్పటికే తెలంగాణలో కరోనా విపరీతంగా పెరిగిపోవడంతో తన పై విరుచుకుపడుతున్న ప్రజానీకం తో సతమతమౌతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వివరించారు. మార్చి 2020 లో జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దీంతో ఇప్పుడు పాస్ అయిన వారంతా కంపార్ట్మెంట్ లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొనడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందబోతున్నారు.
ఇకపోతే మార్కుల రీ-కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను పదిరోజుల్లో అందజేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?