భారత మాజీ కెప్టెన్… లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు అంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పుడు వారి బాధను మరింత రెట్టింపు చేసే వార్త ఇది.
రిటైర్మెంట్ పై అభిమానులు సంతృప్తిగా లేరని… అతనికి ఒక ఫేర్ వెల్ మ్యాచ్ తో వీడ్కోలు పలికేందుకు అవకాశం ఇవ్వాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బిసిసిఐ కు విజ్ఞప్తి చేశారు. మహి కోసం అలాంటి మ్యాచ్ నిర్వహించేందుకు ఝార్ఖండ్ ఆతిథ్యం ఇస్తుంది అని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఇప్పుడు దీనికి ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ధోనీ కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ధోనీ కూడా ఎప్పుడూ అలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని.. ఇక వరుసగా ఉన్న షెడ్యూల్స్, ఐపీఎల్ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కరోనా నేపథ్యంలో అసలు అలాంటి అవకాశమే లేదని తేల్చేశారు. ఇక చివరి వరల్డ్ కప్ లో ధోని రన్ ఔట్ అయిన మ్యాచ్ నే అతని చివరి మ్యాచ్ గా అభిమానులు గుర్తుపెట్టుకోనున్నారు.