జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వైద్య రంగంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పేదవాడికి జీవితం భారం కాకుండా పరిపాలన చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ ఒడి కార్యక్రమం తో పేద వాళ్లకు చదువు భారం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నా వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగంలో కూడా ఆరోగ్య శ్రీ లో అనేక కొత్త రోగాలు చేర్చడం జరిగింది. ఇలా ఉండగా తాజాగా వైద్యరంగం రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం సరికొత్త ఐడియాతో జగన్ సర్కార్ ముందుకు సాగటానికి రెడీ అయ్యింది.
మేటర్ లోకి వెళ్తే ఇకపై అన్ని ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అంత మాత్రమే కాక ఫోన్ చేస్తే డాక్టర్ వైద్య సదుపాయం అందించే రీతిలో సరికొత్త ప్రణాళికలతో ఏపీ సర్కార్ ముందుకు పోతుంది. దీంతో ఈ సరికొత్త నిర్ణయాలతో రాష్ట్రంలోని 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్ పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆ తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే డాక్టర్ కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారు. అంత మాత్రమే గాక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ ఉండే విధంగా జగన్ సర్కార్ ముందుకు రానున్న క్రమంలో.. వైద్యరంగం విషయంలో జగన్ కీలక అడుగులు వేస్తూ కీలక నిర్ణయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.