ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే విశాఖలో మరో ఘటన నిన్న ఆర్ధరాత్రి జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో తెనాలికి చెందిన షిఫ్ట్ ఇన్ చార్జ్ రాగి నాయుడు, విజయనగరానికి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ మృతి చెందారు.
ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కె మీనా పరిశీలించారు. బాయిలర్ లో తెల్లవారుజామున లోపం తలెత్తి గ్యాస్ లీకైందని తెలుస్తోంది. గతంలోనూ ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు.