అనిల్ రావిపూడి దర్శకత్వం లో అప్పట్లో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన “ఎఫ్2” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కొల్లగొట్టింది. దీంతో సీక్వెల్ ప్లాన్ చేసి దిల్ రాజు ప్రస్తుతం “ఎఫ్3” ప్రాజెక్ట్ లైన్ లో పెట్టారు.
సేమ్ వరుణ్ తేజ్ వెంకటేష్ కలిసి చేయబోతున్న ఈ సినిమాలో తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఎందుకంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి కి అదేవిధంగా సాయిధరమ్ తేజ కి మధ్య మంచి బాండింగ్ ఉంది.
దీంతో కచ్చితంగా నటించే ఛాన్స్ ఉన్నట్లు మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొదటి నుండి “ఎఫ్3” ఈ సినిమాలో ముగ్గురు హీరోలు టారని వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో రవితేజ పేరు వినబడింది. తాజాగా ఆ ప్లేస్ లో సాయి ధరమ్ తేజ్ కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.