ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదలైన ఎమ్ జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీకి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ ఎస్యూవీని పెట్రోల్ వెర్షన్ విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది..! ప్రముఖ చైనీస్ కార్ బ్రాండ్ ఎంజి మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంజి జిఎస్ ఎలక్ట్రిక్ ఆధారంగా కంపెనీ పెట్రోల్ వెర్షన్ విడుదల చేసేందుకు భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తుంది..! బెంగళూరు నగర వీధుల్లో ఎంజి పెట్రోల్ వెర్షన్ టెస్టింగ్ చేస్తుంది..
ఎస్యూవీని విభాగంలో ఇది ఐదవ ఉత్పత్తి కానుంది.. ఇది ఎలక్ట్రిక్ కంటే తక్కువ ధరకే లభ్యంకానుంది. ఇది ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తోంది. ఈ కార్ 1.5 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. 1.5 లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బి హెచ్ పి పవర్ ను 141 టార్క్ను ఉత్పత్తిచేస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా నూట 109.4 బి హెచ్ పి పవర్ ను 160 టార్క్ను ఉత్పత్తిచేస్తుంది. ఇది 48 వోల్డ్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టంను కలిగి ఉంది. సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో లభిస్తుంది.
సెమి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఫ్లాట్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ లు , ఎల్ఈడి లైట్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.