ఏపీలో జగన్ సర్కార్ అదిరిపోయే రీతిలో సంక్షేమ పాలన అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా జగన్ ప్రజల పై తనకున్న ప్రేమ ని చూపించి.. ఇతర రాష్ట్ర ప్రజలకు జగన్ లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఉంటే బాగుండేది అన్న రీతిలో వ్యవహరించటం అందరికీ తెలిసిందే.
ఇదే విషయాన్ని ఇటీవల పాండిచ్చేరి మంత్రి బీసీ సంక్రాంతి సభలో తెలపడం జరిగింది. మొదటి తేదీ నాడే పెన్షన్లు డైరెక్ట్ గా ఇంటికి గ్రామ వాలంటీర్ల ద్వారా పొద్దున్నే ఇచ్చేలా పాలన చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా జనవరి ఫస్ట్ నుంచి రేషన్ కూడా అదేరీతిలో ఇంటింటికి డోర్ డెలివరీ చేయడానికి రెడీ అయింది. రేషన్ బియ్యం, నిత్యావసరాల డెలివరీ కోసం 9260 వాహనాలు ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో ఈ డోర్ డెలివరీ చేసే వాహనాలు కోసం టాటా సుజికి సంస్థల దగ్గర నుండి ట్రక్కులు కొనుగోలు చేయడం జరిగినట్లు సమాచారం. రేషన్ ట్రక్కులో ఫ్యాన్, ఫైర్ ఎగ్జాసటర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రేషన్ అనౌన్స్మెంట్ కోసం మైక్ సిస్టం ఉండేలా వాహనం ను రూపొందించడం జరిగింది. ప్రతి ఇంటి వద్ద రేషన్ అందేలా ట్రక్కు లోనే కాటా ఉండేటట్టు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.