ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారి విషయంలో రాష్ట్ర క్యాబినెట్ జోక్యం ఉండకూడదని ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి ఏపీ ప్రభుత్వం కుదించిన విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ తన పదవిలో కొనసాగాలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే తాజాగా మరొకసారి ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయ్యింది.
అదేమిటంటే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదు అని పిటిషన్ దాఖలైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం జరిగింది. అయితే తాజాగా హైకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా రాష్ట్ర ప్రభుత్వం మేరకు చెందింది కాబట్టి ఆ నియామకాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఆ పదవిలో మరో కొత్త వారిని న్యాయస్థానమే నియమించాలని స్థానంలో పిటిషనర్ యొక్క వాదన. మరి ఈ విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.