ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవి క్రియోషన్స్ లో ప్రస్తుతం రాధే శ్యామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత యూవి క్రియోషన్స్ నుంచి వచ్చే సినిమా ఏంటన్నది క్లారిటి లేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆ బ్యానర్ లో సినిమాలు తీసేందుకు ముగ్గురు దర్శకులకి అడ్వాన్సులు కూడా ఇచ్చారట.
అలాగే హీరోలకి అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారని సమాచారం. కాగా ఇప్పుడు ఒక దర్శకుడు – హీరోని కలిసి ప్రాజెక్ట్ ని సెట్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఈ బ్యానర్ లో మారుతి.. భలే భలే మగాడివోయ్ అన్న సినిమాని తీశాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు మారుతి తో పాటు హీరో నాని కి మంచి కమర్షియల్ సక్సస్ దక్కింది. దాంతో మరో సినిమా కి అప్పుడే యువి వారు మారితికి అడ్వాన్స్ ఇచ్చారట. అలాగే రవితేజ డేట్స్ కూడా యువి బ్యానర్ లో ఉండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి యువి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం రవితేజ క్రాక్ అన్న సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఇక సినిమా చేయనున్నాడు. అలాగే త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మెగాస్టార్ గతంలో నటించిన చంటబ్బాయి సినిమా ఇన్స్పిరేషన్ తో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత యువి క్రియోషన్స్ నిర్మించబోయో ప్రాజెక్ట్ మొదలవనుందట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!