1985 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీగా వెలుగొందిన జేసీ బ్రదర్స్ కి ఇప్పుడు బ్యాడ్ టైం పీక్స్ లో ఉందనే చెప్పాలి! నాటి నుంచి 2009 వరకూ బాగానే సాగిన వారి రాజకీయం 2014 ముందు టీడీపీలోకి రావడంతో కాస్త బీటలు వారిందని అప్పట్లో కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ… 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అడ్డేముంది… పైగా చంద్రబాబు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించేసరికి… వారి రాజకీయం, వారి వ్యాపారాలతోపాటు వారి అక్రమాలు కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలుగొందాయని అప్పట్లో కామెంట్లు వచ్చాయి!
2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ తమ వారసులని రంగంలోకి దించారు. దివాకర్ తనయుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేయగా.. ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు! చిత్రం ఏమిటంటే… ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి… కారణాలు ఏవైనా ఇద్దరూ ఓడిపోయారు! ఆక్కడికే బలమైన దెబ్బలు తగలడంతోపాటు తాజాగా ప్రభాకర్, అస్మిత్ లు జైలుకు వెళ్లారు. జేసీ ఫ్యామిలీకి ఇలా వరుస దెబ్బలు తగులుతుండటంతో… తాడిపత్రిలో వీరి బలం తగ్గిపోయినట్లు కనిపిస్తోంది! జేసీ ఫ్యామిలీ వీక్ అవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పుంజుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ పుంజుకోవడం పుంజుకోవడంతో… తాడిపత్రి కేంద్రంగా జేసీ ఫ్యామిలీకు మరో షాక్ ఇవ్వబోతున్నారంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని నియోజకవర్గంలో వినిపిస్తోన్న పొలిటికల్ డిస్కషన్స్ దృష్ట్యా… తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్స్ వేస్తుందట. ఇది ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయినట్లేననే గాసిపిస్ కూడా వస్తున్నాయి. దీంతో తాడిపత్రి కేంద్రంగా జగన్.. జేసీకి మరో గట్టి దెబ్బ కొట్టినట్లే నని కామెంట్లు వినిపిస్తున్నాయి!! దీంతో… జేసీ ఫ్యామిలీ పార్టీ మారం అన్నందుకే జగన్ ఇలా కక్ష గట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు!!