ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత టిడిపి వారంతా నిర్ఘాంతపోయారు. గత కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకిస్తూ గవర్నర్ కు ఎన్నో లేఖలు రాసి… అది కేంద్రం పరిధిలోని అంశమని దానిని రాష్ట్రపతికి సిఫారసు చేయవలసిందిగా కోరారు.
అయితే గవర్నర్ వారి మాటలను పట్టించుకోకుండా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కి తల ఊపారు. ఇక ఇదే సమయంలో టీడీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. 3 రాజధానుల బిల్లు ఆమోదం అయిన తర్వాత దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి తను ఒక్కసారిగా ఉద్యమం నుండి ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇప్పుడే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం చేపట్టాలని… ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయనీయకూడదని భావిస్తున్న టిడిపికి తవి ఉపసంహరణ చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి.