ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబోలో ఆచార్య అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి .. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెజీనా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ నెల నవంబర్ 9 నుంచి షూటింగ్ మొదలవగా ప్రస్తుతం మెగాస్టార్ లేకుండా సీన్స్ కంప్లీట్ చేస్తున్నారట.
కాగా ఈ నెల 20 నుంచి మెగాస్టార్ కూడా ఆచార్య సెట్ లో జాయిన్ కాబోతున్నారు. అంతేకాదు ప్రముఖ నటుడు కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నట్టు తాజా సమాచారం. ఇక ఆచార్య లో సోనూసూద్ క్యారెక్టర్ సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఆచార్య లో సోనూసూద్ నటిస్తున్నాడనగానే మెగా ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఈ నెలాఖరు వరకు ఆచార్య సెట్ కి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఆచార్య లో కీలక పాత్ర పోషిస్తున్న చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.. ఆచార్య కోసం 20 రోజులు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. కాగా ఫిబ్రవరి లో చరణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ఈ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి కొరటాల శివ ఈసారి మాత్రం ఆచార్య సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో సమ్మర్ టార్గెట్ మిస్ కాకుండా రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడయ్యారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రత్యేకం అని చెప్పుకుంటున్నారు.