టీడీపీలో దూకుడుగా ఉండే నేతలను వైసిపి ప్రభుత్వం టార్గెట్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసిపిని వెంటాడిన నేతలకు ఇప్పుడు చుక్కలు చూపించే పనిలో జగన్ సర్కార్ ఉంది.
ఇప్పటికే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు ,రవీంద్రలకు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటం తెలిసిందే.ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును హత్యకేసులో రవీంద్ర లను జైలుకు పంపేశారు.అలాగే టిడిపి మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా కారాగారవాసాన్ని రుచి చూపించారు.మాజీ ఎంపీ ,టీడీపీ వాయిస్ గా వెలుగొందుతున్న సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను ఆక్రమణ పేరుతో కొట్టేశారు.అలాగే బాలయ్య చిన్నల్లుడు ,విశాఖపట్నం లో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శ్రీ భరత్ కు చెందిన గీతం యూనివర్శిటీ భవనాలను తొలగించారు మొత్తం ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని గీతం యూనివర్శిటీ ఆక్రమించుకుందంటూ ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో వైసిపి సర్కారుకు టార్గెట్ కానున్న నెక్స్ట్ టిడిపి నేత ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.కృష్ణా జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కొరడా ఝలిపించబోతున్నట్లు ఆ వర్గాలే చెబుతున్నాయి.టిడిపి హయాంలో జగన్పై ఒంటికాలిపై లేచిన టిడిపి నేతల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరు.అసెంబ్లీలో కూడా జగన్తో సహా వైసిపి సభ్యులందరినీ ఆయన ఆటాడుకున్నారు.శాసన సభ బయట ప్రెస్మీట్లలో జగన్ పైనా ,ఆయన పార్టీ మీద ఉమా మహేశ్వరరావు టన్నులకొద్దీ బురద చల్లారు.
తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాల్లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి మాజీ అయిపోయినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దేవినేని ఉమ స్పీడ్ తగ్గలేదు.అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు.దీంతో ఉమామహేశ్వరరావు కూడా షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని జగన్ ప్రభుత్వం తలపోస్తోందట.ఇందులో భాగంగా కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి, అవకతవకలపై లోతుగా విచారణ జరిపిస్తోందని ఆ నివేదిక రాగానే దేవినేని ఉమాకు తన మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాలి.