తండ్రి అకాల మరణం తర్వాత అనూహ్య రీతిలో ఎమ్మెల్యే సీటు వరించి ఆ తర్వాత మంత్రిగా వ్యవహరించిన టిడిపి మహిళా నేత తన పదవి పోయిన తర్వాత సొంత పార్టీకి చెందిన నేత హత్యకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు భూమా అఖిలప్రియ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన భూమా అఖిల ప్రియా పై హత్యారోపణలు రావడం అప్పట్లో పెద్ద సంచలనం అనే చెప్పాలి.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మహిళా నేతలు ఉన్నా హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేస్తున్నారంటూ అదే పార్టీకి చెందిన నేత ఒకరు ఆరోపణలు చేయడం మరియు పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం అసలు ఇప్పటి దాకా ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. ఒకప్పుడు తన తల్లిదండ్రులకు అత్యంత సన్నిహితుడిగా మరియు కుడిభుజంగా ఉన్నా ఏవీ సుబ్బారెడ్డి తో రాజకీయ వైరం పెంచుకున్న అఖిల ప్రియ అతనిని అంతమొందించేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటోంది.
తన ని చంపడం కోసం కిరాయి గుండాలకు 50 లక్షల రూపాయల మొత్తాన్ని అఖిల ప్రియ భర్త భార్గవ్ రాం ఇచ్చినట్టు ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. తనకు తన కుటుంబానికి భూమా అఖిలప్రియ, తన భర్త వల్ల ప్రాణహాని ఉందని అతను పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని కోరడమే కాకుండా ఆమె అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విషయమై సుబ్బారెడ్డి పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. తాను ఫిర్యాదు ఇచ్చి ఇన్ని రోజులైనా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో త్వరలోనే భూమా అరెస్టు తథ్యంగా కనపడుతోందని ఆళ్లగడ్డ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ..ఆయన ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని అరెస్టు చేస్తే మాత్రం.. ఇలాంటి ఆరోపణలతో అరెస్టు అయిన మొదటి మహిళా మాజీ మంత్రిగా అఖిల ప్రియ నిలిచిపోవటం ఖాయం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?