విశాఖలో మరొక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీ లో విశాఖ సాల్వెంట్ కంపెనీ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటికే మంటలు ఆ పరిశ్రమ నుండి భారీగా ఎగిసిపడుతున్నాయి. స్థానికులంతా భయాందోళనల్లో ఉన్నారు. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను తీవ్రంగా కమ్ముకుంది.
ఇకపోతే ఆ మంటల్లో పలువురు చిక్కుకున్నట్టు స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఆ మంటల సమీపంలోకి వెళ్లిన అగ్నిమాపక బృందం వాటి తీవ్రతను తట్టుకోలేక తిరిగి వచ్చేశారు.
వాతి వేడిని తగ్గించేందుకు తమ శకటాల ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ అగ్నిప్రమాదంతో పలు కంపెనీలు మరియు స్థానికులు విపరీతంగా భయపడుతున్నారు. ఇకపోతే భారీగా ఎగిసిపడుతున్న మంటలు వల్ల పొగ విశాఖ సిటీని కమ్మేసింది. ఈ ఘటన రాంకీ ఫార్మా సిటీ లోని సీఈటీపి సాల్వెంట్స్ లోని ట్యాంక్ లో పేలుళ్ళ కారణంగానే చోటు చేసుకుందని చెబుతున్నారు.
అయితే మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా లేక ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదా అన్న విషయం మరికొద్దిసేపట్లో తెలియనుంది.