ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఈ మధ్య కాలంలో కులపరమైన ఆరోపణలు బాగానే వచ్చాయి. టిడిపి నాయకుల అరెస్టు అనంతరం ఆయన బిసి వర్గాలకు మొండిచేయి చూపిస్తున్నారని మరియు వారి పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ఆయనపై విరుచుకుపడ్డ విషయం అందరికీ తెలిసిందే.
దీంతో జగన్ తన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఇచ్చే పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కొద్దిగా పెంచుతారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ రాష్ట్రంలో నిమ్నవర్గాల గా చెప్పబడే వారికే పెద్దపీట వేస్తున్నారనే రిపోర్టులు బయటకు వచ్చాయి.
రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు కాగా వారిలో ఒకటి ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు కి ఇవ్వగా మరొకటి మైనారిటీకి చెందిన అఫ్జల్ ఖాన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు వీరిద్దరి పేర్లు ఖరారు అయిపోయినట్లే అట. ఇక ఈ వార్తను ఉదయమే మా న్యూస్ ఆర్బిట్ ప్రచురించగా సాయంత్రానికి ఇవే పేర్లు ఖరారు అయినట్టు వార్తలు రావడం గమనార్హం.
ఇంకా అధికారికంగా ఈ పేర్లను ప్రకటించడం ఒకటే మిగిలి ఉండగా దీనిపై ఏయే వర్గాల్లో అసంతృప్తి నెలకొనబోతోందో ఆ తర్వాత బయట పడనుంది.