అంతర్వేది లో రథం తగలబడిన సంఘటనలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని జగన్ ప్రభుత్వం బుక్ చేయబోతుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తింది.
ఈ ఉదంతంపై జగన్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే వైసిపి మౌత్ పీస్ రోజా తనదైన శైలిలో స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు గతంలో తుని లో రైలు దహనం, రాజధాని భూములు తగలు బెట్టించిన ఘనత చంద్రబాబుదేనని ఆమె దుమ్మెత్తి పోశారు .అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు పెట్టింది పేరని ,సీబీఐ రాష్టానికి రావద్దని గతంలో జీవో ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అంతర్వేది రథం దగ్ధం సంఘటనపై సీబీఐ విచారణ కోరుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
తమ చిత్తశుద్ది నిరూపించుకునేందుకు సీఎం వైఎస్ జగన్… అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారని తెలిపారు.ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన నిజాలు బయటకొస్తాయని చంద్రబాబు నీచ రాజకీయం వెలుగు చూస్తుందని రోజా చెబుతున్నారు.ఇటీవల అంతర్వేది లో రథం తగలబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈ అంశాన్ని రాజకీయ నేతలు మాత్రం దీనిపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నారు .ముఖ్యంగా ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందడానికి టిడిపి బిజెపి జనసేన కూటమి ఎత్తుగడ వేశాయి . అయితే జగన్ తన చిత్తశుద్ధి చాటుకోవడానికి ఈ సంఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద చేసిన రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?