కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనుక్కునే పనిలో ప్రపంచలోని సైంటిస్టులు ఉన్నారు. అదే పనిగా గంటల తరబడి ల్యాబులకే పరిమితం అవుతున్నారు. ఎన్నో పరిశోధనలు మరిన్నే టెస్టులతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో కొన్ని ఆనంద పడే విషయాలు.. మరికొన్ని బాధపెట్టే విషయాలు బయట పడుతున్నాయి. అయితే ఈ మధ్య జరిగిన ఒక పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని సైంటిస్టులు భయటపెట్టారు.
కొందరిలో ముందు నుంచి ఉండే యాంటీబాడీస్ వల్ల కరోనా వైసర్ ను తట్టుకునే శక్తి వారిలో ఉంటుందని తెలిపారు. దాంతో వారికి కరోనా సోకిన కూడా ఏం కాదని తెలిపారు. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, మరికొంత మంది సైంటిస్టులు ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాలను పలు పత్రికలు ప్రచురించాయి.
కరోనా వైరస్ సోకని కొంతమందిలో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ రకమైన యాంటీబాడీస్ ను గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. అంటే కరోనా సోకకుండానే వారిలో దాన్ని నియంత్రించే యాంటీబాడీస్ ఉన్నాయనని అర్థం. జలుబుకు కారణమయ్యే వైరస్ ల వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటి నిర్మాణం సార్స్ ను పోలి ఉంటుందని తెలిపారు. దీంతో వారు కరోనా బారిన పడగానే ముందునుంచే ఉన్న యాంటీబాడీస్ వాటితో పోరాడుతాయని తెలిపారు.
కరోనా వైరస్ యాంటీబాడీ పరీక్షల కోసం అభివృద్ధి చేసిన ఒక పరీక్షా విధానాన్ని ఈ రీసెర్చు లో సైంటిస్టులు వాడారని సమాచారం. కరోనా వైరస్ సోకిన వారు, కరోనా వైరస్ సోకని వారి బ్లెడ్ సాంపిల్స్ ను ఇందులో పరీక్షించారు. కరోనా వైరస్ బారిన పడనివారిలోనూ ఈ యాంటీబాడీలు ఉన్నాయని గుర్తించారు. దీన్ని రుజువు చేయడానికి కరోనా వైరస్ రాకంటే ముందు 2011-2018 మధ్యలో సేకరించిన కొన్ని బ్లెడ్ సాంపిల్స్ ను సైంటిస్టులు పరిశీంచారు. దాంతో అన్నింటిలో కరోనా వైరస్తో పోరాడే యాంటీబాడీస్ ను గుర్తించారు. ప్రతి 20 మందిలో కనీసం ఒకరిలోనైనా ఈ రకమైన యాంటీబాడీస్ ఉన్నాట్లు సైటిస్టులు కనుగొన్నారు. ఇది 6 ఏళ్ల నుంచి 16ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఎక్కువగా ఉన్నాట్లు తెలిపారు.
ఇలా పలు యాంటీబాడీస్ మీద పరిశోధనలు చేశారు. ఈ జలుబును కలిగించే వాటని ఎదుర్కొనడానికి తయారైన యాంటీబాడీస్ కరోనాను కూడా ఎదుర్కొంటాయని ఈ పరిశోధన వల్ల బయట పడింది.ఈ రీసెర్చ్ లో ఎస్-2పై దాడి చేసి కూడా కరోనాను అంతం చేయొచ్చని తెలుసుకున్నారు.వీటి సాయంతో సమర్థమైన వ్యాక్సిన్లను తయారు చేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.